విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన వైస్ చైర్మన్

హుస్నాబాద్ పట్టణంలోని 4వ వార్డ్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు రెండవ విడుత నోటు పుస్తకాలను మరియు ఏకరూప దుస్తులను మునిసిపల్ వైస్ చైర్మన్ అయిలేని అనిత పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వినియోగించుకొని, ఉన్నతంగా చదవాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడ్డాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధించడం శుభపరిణామం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా , వైద్య,రంగాలకు మరియు సంక్షేమ పథకాలు అమలుకు విశిష్ట ప్రాధాన్యత ప్రాధాన్యతనిచ్చిన సంధర్భముగా ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాద్యాయులు లక్ష్మణ్ రెడ్డి , ఉపాధ్యాయురాలు రాధ రాణి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.