విద్యుత్తు కోతలను ఎత్తివేయాలని భాజపా ఆందోళన

ఖమ్మం సంక్షేమం: విద్యుత్తు కోతలను ఎత్తివేయాలంటూ జిల్లా భాజపా ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో ఎన్‌ ఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నాయకులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు నాయకులను అరెస్టు చేశారు. అనంతరం వ్యక్తి గత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌ రెడ్డి, రాష్ట్రనాయకులు విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.