విద్యుత్‌ షాక్‌తో కార్మికుడి మృతి

ఒంగోలు,నవంబర్‌24(జ‌నంసాక్షి): సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ ఆపరేటర్‌ విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లాలో శనివారం జరిగింది. దోర్నాల మండలం వై చెర్లోపల్లిలోగల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో రామానాయక్‌(40) అనే వ్యక్తి ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే… ప్రమాదవశాత్తూ విద్యుత్‌ షాక్‌ తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా… మృతిచెందిన రామానాయక్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.