విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

గుత్తి ట్రాన్స్‌కో కార్యాలయం ముందు ధర్నా
అనంతపురం,జనవరి3(జ‌నంసాక్షి): అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం భీమునిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్‌షాక్‌తో సుధాకర్‌ అనే యువకుడు మృతి చెందాడు. అయితే గ్రామంలో విద్యుత్‌ సరఫరాపై గతంలో అధికారులకు చెప్పినా పట్టించుకోలేదంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యమే యువకుడి మృతికి కారణమంటూ గుత్తి ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ట్రాన్స్‌కో కార్యాలయంపై గ్రామస్థులు రాళ్లు రువ్వారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వారికి నచ్చజెప్పేందుకు యత్నించారు. యువకుడి కుటుంబానికి న్‌ఆయయం చేయాలని పలువురు డిమాండ్‌ చేశారు.