విద్యుత్ సబ్స్టేషన్కు మంత్రి శంకుస్థాపన
గుంటూరు,జనవరి24(జనంసాక్షి): వేమూరు నియోజకవర్గం యడ్లపల్లి గ్రామంలో కోటి యాబై లక్షలతో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్కు గురువారం మంత్రి నక్కా ఆనందబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… విద్యుత్ సబ్ స్టేషన్ ద్వారా 15 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. 5 వేల కుటుంబాలు, 1200 మంది రైతులకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. గతంలో విద్యుత్ కొరతతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. సిఎం చంద్రబాబు విద్యుత్లో సంస్కరణలు తీసుకుని రావడం వల్ల దేశం విద్యుత్ సరఫరాలో మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత పట్టణ, గ్రామాల్లో 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. రైతులకు ఎక్కడా విద్యుత్ కొరత లేకుండా ఇస్తున్నామని మంత్రి నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు.