విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు

ఖమ్మం : వినుకొండ మండలం బాణాపురం పరిసర గ్రామాలకు చెందిన రైతులు విద్యుత్ కోతలకు నిరసనగా బాణాపురం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంగళవారం ఉదయం ముట్టడించారు. ఇష్టమొచ్చినట్లుగా విద్యుత్ కోతల కారణంగా తమ పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖాధికారులు జోక్యం చేసుకుని సక్ర మ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.