విపక్షాల తీర్మానం వీరిగిపోతుంది : కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశా ప్రత్యేక్ష పెట్టుబడుల అంశంపై ఓటింగ్‌తో కూడిన చర్చ జరగనున్న నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టే తీర్మానం వీగిపోతుందని పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. భాజపా రాజకీయ చక్రంలో ఇతర పార్టీలు చిక్కుకోవద్దని ఆయన కోరారు. ఎస్సీ, బీఎస్పీల మద్దతుపై మంత్రిని  ప్రశ్నించగా.. ఓటింగ్‌లో గెలవడానికి తమకు అవసరమైన సంఖ్యాబలం ఉందని స్పష్టం చేశారు.