విభజన హావిూలను అమలు చేసే బాధ్యత కాంగ్రెస్దే
కాంగ్రెస్ సమావేశంలో రఘువీరా
కాకినాడ,నవంబర్23(జనంసాక్షి): రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి హావిూ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమం, ఎన్నికల ప్రణాళిక అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి, దేశ సుస్థిరత కాంగ్రెస్తో ముడిపడి ఉందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక ¬దా కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యపడుతోందన్నారు. జీఎస్టీని సరళీకృతం చేస్తామని, సామాజిక, ఆర్థిక సుస్థిరత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని భాజపా నట్టేట ముంచిందని, తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధాని
నరేంద్ర మోదీ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో రూ.30 వేల కోట్ల అవినీతి ఆరోపణలతో తొలిసారిగా ప్రధాని దోషిగా నిలబడ్డారని ఆరోపించారు. దేశాన్ని ప్రేమించేది కాంగ్రెస్ అయితే, దేశాన్ని ద్వేషించేది భాజపా అని, ఎటువైపు ఉంటారో ప్రజలే తేల్చుకోవాలన్నారు. థర్డ్ ప్రంట్ అనేది కూలిపోయే టెంట్ అని, దేశంలో అలాంటి ఫ్రంట్కు ఎలాంటి అవకాశాలూ లేవన్నారు. ఎన్నికలకు ముందే అది కూలిపోతుందని జోస్యం చెప్పారు. ఐదేళ్లలో ఏపీని అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని, రాహుల్ ప్రధాని అయితే ఏపీ ప్రత్యేక ¬దా దస్త్రంపైనే ఆయన తొలి సంతకం చేస్తారని రఘువీరారెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.