విలేకరి మృతికి ఎమ్మెల్యే నివాళి
వ్యక్తిగతంగా సాయం
గూడూరు,నవంబర్21(జనంసాక్షి): గుండెపోటుతో అకాల మరణం చెందిన టెన్ టివి రిపోర్టర్ షేక్ కాలేషా భౌతికకాయానికి ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ నివాళులర్పించారు. అనంతరం కాలేషా కుటుంబ సభ్యులను పరామర్శించి, అంత్యక్రియలకు గాను తనవంతు రూ.10 వేల రూపాయలు ,శ్రీలక్ష్మీ ఛారిటబల్ ట్రస్ట్ 20-వేలను అందజేశారు. ఇంకా ప్రభుత్వం ద్వారా కూడా ఆర్ధిక సహాయం అందేలా చూస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కాలేషా కుటుంబాని తాను అండగా ఉంటానని, తన పిల్లలలో ఒకరికి చదువులకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. అలాగే ఎన్టీఆర్ నగర్లో నిర్మిస్తున్న అపార్టుమెంట్లలో ఒక సింగిల్ బెడ్ రూం ఇల్లు కేటాయిస్తామని చెప్పారు. ఆ ఇంటికి అయ్యే మొత్తం ఖర్చు కూడా తానే చెల్లిస్తానని మృతుని కుటుంబ సభ్యులకు భరోసా నిచ్చారు.