విశాఖ జిల్లాలో విషాదం

ఇద్దరు పిల్లల తో స‌హ‌తల్లి ఆత్మహత్యా యత్నం

ఇద్దరు పిల్లల లు మృతి-  తల్లిని కాపాడిన స్ధానికులు

అమరావతి: విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి తల్లి ఆత్మహత్యా యత్నం చేసుకున్న సంఘటన విశాఖ జిల్లా రోలుగుంట మండలం జే.నాయుడుపాలెంలో జరిగింది . కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో పాటు తల్లి బావిలో దూకింది. స్థానికులు గమనించి వారిని కాపాడే ప్రయత్నం చేశారు.

అయితే అప్పటికే ఐదేళ్ల బాలిక భాను, మూడేళ్ల బాలుడు పృథ్వీ మృతి చెందారు. తల్లిని కాపాడారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను వెలికితీయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.