వీఆర్ఏల దీక్షకు బీఎస్పీ పార్టీ మద్దతు

చండ్రుగొండ జనంసాక్షి (జూలై  28)  : గత  4రోజులుగా  వీఆర్ఏల  నిరసన  దీక్ష కొనసాగుతుంది. వారి దీక్షకు   గురువారం  బీఎస్పీ పార్టీ  మద్దతు తెలిపింది. ఈ సందర్బంగా బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు  ఇనుముల   పిచ్చయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ వీఆర్ఏలకు  ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. వారి కోరికలు న్యాయమైన వన్నారు. పెరిగిన  నిత్యావసర ధరలకు అనుగుణంగా  తక్షణం పే స్కేలు  అమలు చేయాలని  డిమాండ్ చేశారు. ఆయన వెంట  బీఎస్పీ పార్టీ ప్రధాన కార్యదర్శి కుక్కమూడి చంటి, చాపలమడుగు గణేష్ బాబు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు.