వృత్తి విద్యా ఫీజుల పిటిషన్‌ పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ: వృత్తి విద్యా కళాశాల ఫీజులకు సంబంధించిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 9కి వాయిదా వేసింది. అదనపు సమాచారంతో మరో అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు కళాశాల యాజమాన్యాలు కోర్టును సమయం కోరాయి. అయితే ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.