వెనిజులాలలో రాజకీయ సంక్షోభం

అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆందోళనలు

న్యూఢిల్లీ,జనవరి24(జ‌నంసాక్షి): వెనుజులాలో రాజకీయ సంక్షోభం నెలకొంది. దేశాధ్యక్షుడిగా రెండోసారి నికోలస్‌ మదురో భాద్యతలు చేపట్టడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. వేలాదిగా జనం రోడ్లపైకి వచ్చి మదురోకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఆందోళనకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 11మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మదురో తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆంక్షల పేరుతో సామాన్యుల ప్రాణాలు తీస్తున్న అధ్యక్షుడు గద్దె దిగాలని డిమాండ్‌ చేస్తున్నాయి.