వెయ్యి ఫోన్లు నంబర్లు కంఠస్తం

అచ్యుతాపురం మండల వాసి రికార్డు
విశాఖపట్టణం,డిసెంబర్‌1(జ‌నంసాక్షి):కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేయాలంటేనే నంబరు గుర్తుండని ఈ రోజుల్లో ఏకంగా వెయ్యిమంది ఫోను నంబర్లు  గుర్తుంచుకున్నాడు ఈ యువకుడు. అబ్బురపరిచే ఇతని జ్ఞాపక శక్తిని తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు ప్రతినిధులు గుర్తించారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువకుడు అప్పలాచారి పేరిట ఈ రికార్డు నమోదు చేశారు. ముందుగా ముద్రించిన వెయ్యి మంది ఫోను నంబర్లను హాజరైన వారికి, ప్రతినిధులకు అందించారు. వారు ప్రశ్నించిన ప్రకారం ఆ యువకుడు ఫోన్‌ నంబర్లను 99 శాతం సరిగ్గా చెప్పాడు.