వేచరేణిలో వెలుగులు పుస్తకావిష్కరణ

చేర్యాల మండల పరిధిలోని వేచరేణి ఉన్నత పాఠశాలలో వెలుగులు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హెచ్.ఎం కె.విఎన్ రెడ్డి అధ్యక్షతన వహించారు. ఉపాధ్యాయుడు మంగళగిరి రామచంద్ర మూర్తి రాసిన స్వీయ రచనలు, సంపాదకీయం, ఖర్చులతో ఈ బడిలో మొట్ట మొదటి సారిగా కవితా సంకలనం వెలువరించిన పుస్తక ఆవిష్కరణకు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ ఏనుగుల దుర్గయ్య, ఎంపీటీసీ ఏనుగుల లక్ష్మి, చైర్మన్ యాదగిరి, నర్సయ్య, ఎంఈఓ నర్సింహారెడ్డి, విశ్రాంత ఎంఇఓ రాములు, రఘుపతి రెడ్డి, పాఠశాల గోవింద రాజ, ఉపాధ్యాయులు రామాంజనేయులు, ఐలయ్య, వి.ప్రభాకర్, కాంతి కృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు నరహరి, పరమేశ్వరయ్య, విమలాకర్, పాషా, హరిప్రసాద చారీ, సంతోష్ సరస్వతి, గణేష్ లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు