వేములవాడలో ప్రేమవివాహం..అడ్డుకున్న బంధువులు..

కరీంనగర్ : వేముల వాడ ఆలయంలో ప్రేమ వివాహాన్ని యువతి బంధువులు అడ్డుకున్నారు. ప్రియుడిపై దాడి చేశారు. దీనితో ఆలయం వద్ద కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..వరంగల్ జిల్లా కాజీపూర్ కు చెందిన రాజు, రమ్యలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు మందలించారు. కానీ ఇరువురూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఈ తరుణంలో కరీంనగర్ జిల్లాలో వేములవాడలో వివాహం చేసుకోవడానికి రమ్య, రాజులు వెళ్లారు. వీరి కోసం యువతి బంధువులు గాలింపులు చేపట్టారు. వేములవాడలో వీరి వివాహాన్ని అడ్డుకున్నారు. మరోకరితో వివాహం జరిగిందని, మోసం చేస్తున్నాడని యువతి బంధువులు రాజుపై దాడి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కానీ యువతి మాత్రం తాను ఇష్టపడే వివాహం చేసుకుంటున్నాని, ఆ మహిళతో విడాకులైనట్లు పేర్కొంటోంది.