వైసిపి బూత్ కన్వీనర్లకు శిక్షణ
చిత్తూరు,నవంబర్21(జనంసాక్షి): చిత్తూరు మండల పరిధిలోని 23 పంచాయతీల బూత్ కన్వీనర్లతో వైసిపి శ్రేణులు బుధవారం మండల వైసిపి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సమాయత్తం కావడంపై బూత్ కన్వీనర్లకు శిక్షణ కల్పించారు. మండల వైసిపి యూత్ అధ్యక్షుడు సాని విజరు కుమార్ అధ్యక్షతన ఓటర్ల నమోదు, బోగస్ ఓటర్ల తొలగింపు మార్పులు, చేర్పులపై అవగాహన కల్పించారు. 2019 లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే సంకల్పంతో అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా వైసిపి ఉపాధ్యక్షులు ఎవి.జయరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు రఘురామరెడ్డి, యూత్ ఉపాధ్యక్షుడు మురుగేష్, పార్టీ ఎంపిటిసి లు రమేష్ రెడ్డి, రామకఅష్ణా రెడ్డి, కెవి.కఅష్ణమూర్తి, మంజునాథ్, భాస్కర్, మండల సోషల్ విూడియా కోఆర్డినేటర్ జెఎల్ గంగాధరం శెట్టి, కార్యకర్తలు పిసి.వెంకటా చలపతిరెడ్డి. జె.రామమూర్తి , కె.ముని చంద్రారెడ్డి, అక్రంబాషా, కల్లు బండ కోదండరెడ్డి, బూత్ కన్వీనర్లు, 23 పంచాయతీల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.