వ్యాపం కుంభకోణంపై రాహుల్ వ్యాఖ్యలు
పరవు నష్టం వేస్తానన్న శివరాజ్ సింగ్
భోపాల్,అక్టోబర్30(జనంసాక్షి): మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలు చేయబోతున్నారు. వ్యాపం కుంభకోణంలో తన కుటంబంపై రాహుల్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని శివరాజ్ విమర్శించారు. వ్యాపం, పనామాతో పాటు అనేక స్కామ్ల్లో శివరాజ్తో పాటు అతని కుమారుడు కార్తికేయ ఉన్నారని సోమవారం రాహుల్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై తాను చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సీఎం చౌహాన్ ట్విట్టర్లో వెల్లడించారు. నిరాధార ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రాహుల్పై వీలైనంత పరువునష్టం వసూలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. దీనిపై విచారణ జరిగిందని, దోషులు ఎవరో తేలిందన్నారు. అయితే కావాలనే తన కుటుంబాన్ని ఇందులోకి లాగి పరువుకు నష్టం కలిగించారని అన్నారు.