శంషాబాద్ మండలం అభివృద్ధికి కృషి చేయాలి – జెడ్పీ ప్లోర్ లీడర్ నీరటీ తన్వీరాజ్

రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : శంషాబాద్ మండలం అభివృద్ధికి కృషి చేయాలని జెడ్పీ ప్లోర్ లీడర్ నీరటీ తన్వీరాజ్ అన్నారు.
మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న సమస్యలపై అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు.
శంషాబాద్ నుండి షాబాద్ వెళ్లే ప్రధాన రహదారి పై నర్కడ వద్దల బ్రిడ్జి మరమ్మతులు చేపట్టి వరద నీరు అంతా బ్రిడ్జి కింద వెళ్లే విధంగా పనులు చేపట్టాలన్నారు. అంతే కాకుండా నర్కడ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వెయిటింగ్ హాల్ నిర్మాణం, ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని కోరారు. మండలంలోని వివిధ గ్రామాలలో అంగన్వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు.
ఫోటో రైటప్ : జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ ప్లోర్ లీడర్ నీరటీ తన్వీరాజ్.