శవమై తేలిన లైలాఖాన్‌ అదృశ్యంలో వీడిన మిస్టరీ

శ్రీనగర్‌, జూలై 5 : దాదాపు పదకొండు నెలలలుగా  అదృశ్యమైన బాలీవుడ్‌ నటి  లైలా ఖాన్‌ మృతి చెందిందని జమ్ము కాశ్మీర్‌ పోలీసులు తెలిపారు. లైలా ఖాన్‌తో పాటు ఆమె కుటంబ సభ్యులు అందరూ  ముంబయిలో మృతి చెందారని చెప్పారు.   లైలా మృతదేహాన్ని పోలీసులు ముంబయిలో కనుగొన్నారు. లైలాతో పాటు ఆమె కుటుంబ సభ్యులంతా మృతి చెందినట్టు పోలీసు కస్టడీలో ఉన్న పర్వేజ్‌ అహ్మద్‌ తక్‌  తమ విచారణలో వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. వారంతా ముంబయిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారని చెప్పారన్నారు.లైలా కుటుంబసభ్యులను  దారుణంగా హత్య చేసినట్లుగా తక్‌ చెప్పినట్లుగా తెలుస్తోంది.

పాకిస్తాన్‌లో పుట్టిన లైలాఖాన్‌ ఆ తర్వాత బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఇటీవలే లష్కరే తోయిబాతో లింక్స్‌ ఉన్నట్లుగా ఆరోపణలు  వచ్చాయి. ఉగ్రవాదులతో సంబంధం ఉండటం వల్లే ఆమె అదృశ్యమైందన్న  వాదనలు కూడా వినిపించాయి. ఆమె 2011వ సంవత్సరం మే 29 నుంచి కనిపించకుండా పోయింది.  లైలాఖాన్‌ మోస్ట్‌ వాంటెడ్‌ దావూద్‌ ఇబ్రహీంను పెళ్లి చేసుకున్నట్లుగా ఇటీవలే అహ్మద్‌ తక్‌ పోలీసులకు తెలిపిన విషయం తెలిసిందే. టెర్రరిస్టులతో లింక్స్‌ ఉన్నాయని తేలడంతో మహారాష్ట్ర ఏటిఎస్‌ (తీవ్రవాద వ్యతిరేక బృందం) ఆమె కోసం గాలింపులు కూడా చేపట్టింది. తన కూతురు లైలాఖాన్‌  తల్లి, చెల్లితో పాటు కనిపించకుండా పోయిందని ఆమె తండ్రి ఇటీవల ముంబయి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసిన విషయం తెలిసిందే. కాగా అంతకు ముందు ఢిల్లీ హైకోర్టు పేలుడులో వర్ధమాన తార లైలాఖాన్‌ పాత్రపై అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. 2011  ఫిబ్రవరిలో పేలుళ్లు సంభవించిన మరుక్షణం నుంచి ఆమె ఆశ్చర్యకరంగా ఎవరికీ కనిపించకుండా పోయింది. లైలా ఖాన్‌ ఆసలు పేరు రేష్మా పటేల్‌. ఈ పేలుళ్లలో ఆమె పాత్రపై  మహారాష్ట్ర ఎటిఎస్‌, ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం, జమ్మూ కాశ్మీర్‌ పోలీసు బలగాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. హైకోర్టు పేలుడుకు ముందు లైలా ఖాన్‌, ఆమె అసోసియేట్‌ ఢిల్లీలో ఉన్నారా అనే విషయాన్ని జమ్మూ కాశీర్‌ పోలీసులు, ప్రత్యేక బలగం పోలీసులు ఇతర నిఘా సంస్థలతో  ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటున్నారు. లైలా ఖాన్‌ లష్కరే తోయిబా మిలిటెంట్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ తక్‌తో స్నేహం చేసినట్లు అనుమానిస్తున్నారు. తక్‌ అద్దెకు తీసుకున్న దుకాణంలో లైలా ఖాన్‌ తల్లి సలీనా పటేల్‌కు చెందిన మత్సుబిషి అవుట్‌ ల్యాండర్‌ పోలీసులకు చిక్కింది. గత ఏడాది  సెప్టెంబర్‌లో  హైకోర్టు వద్ద పేలుళ్లకు వాడిన పదార్థాలను ఈ వాహనంలోనే చేరవేసి ఉంటారని అనుమానిస్తున్నారు. లైలాఖాన్‌ పాకిస్తాన్‌ సినిమాల్లో నటించింది. 2008లో రాజేష్‌ ఖన్నా చిత్రం వఫాలో ఆమె నటించింది. ఆమె కాల్‌ రికార్డులను పరిశీలిస్తే చివరి కాల్‌ నాసిక్‌లో ఉన్నప్పుడు నమోదైంది. అది 2011 ఫిబ్రవరిలో తక్‌ 2008 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపి తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. తక్‌ పరారీలో ఉండగా, అతని సన్నిహిత మిత్రుడిని షకీర్‌ హుస్సేన్‌ను ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకున్నారు. లైలాఖాన్‌ను, పేలుళ్లలో మరో అనుమానితుడిని మిలిటెంట్లు కిస్త్వర్‌లో చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు. లైలాఖాన్‌ కుటుంబ సభ్యులు కిస్త్వర్‌ రాలేదని జమ్మూ  కాశ్మీర్‌ పోలీసులు అంటున్నట్లు వార్తలు వచ్చాయి.. లైలాఖాన్‌ కుటుంబ సభ్యుల అదృశ్యం వెనక తక్‌ పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఏది ఏమైనా  సాక్ష్యం లభించే వరకు పేలుళ్లలో లైలాఖాన్‌ పాత్ర ఉందని చెప్పలేమని ఎటిఎస్‌ వర్గాలంటున్నాయి. అయితే, మూడేళ్ల క్రితం లైలాఖాన్‌ బంగ్లాదేశ్‌ ఉగ్రవాద సంస్థ హుజీ సభ్యుడు మునీర్‌ ఖాన్‌ను లైలా ఖాన్‌ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె మృతి చెందినట్లుగా పోలీసులు చెప్పారు.