శివసేన భవన్‌ చేరుకున్న థాకరే అంతిమయాత్ర

ముంబయి: శివసేన అధినేత బాల్‌థాకరే అంతిమయాత్ర శివసేన భవన్‌కు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం శివాజీ పార్కులో అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. థాకరే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పలువురు రాజకీయ, సీని ప్రముఖులు ఇప్పటికే శివాజీ పార్కుకు చేరుకున్నారు  భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ, ఆ పార్టీ సీనియర్‌ నేతలు ఎల్‌. కె. అద్వానీ, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, ప్రముఖ సినీ నటుడు  అమితాబ్‌ తదితరులు శివాజీ పార్కుకు చేరుకున్నారు. థాకరే మృతికి సంతాప సూచకంగా నాగ్‌పూర్‌లో శివసేన కార్యకర్తలు శిరోముండనం చేయించుకున్నారు.