శ్రీకాకుళం పర్యటనలో కేంద్రమంత్రి
శ్రీకాకుళం,నవంబర్19(జనంసాక్షి): కేంద్ర శాఖ సహాయ మంత్రి హంస కుమార్ గంగారాం అహిర్ శ్రీకాకుళం చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కెవిఎన్.చక్రధర బాబు స్వాగతం పలికారు. సోమవారం ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఇన్చార్జ్ కలెక్టర్ కెవిఎన్.చక్రధర బాబు, ఎస్పి సిఎం త్రివిక్రమ వర్మతో కలిసి కేంద్ర ¬ం శాఖ సహాయ మంత్రికి స్వాగతం పలికారు. బిజెపి నేషనల్ సెక్రటరీ సునీల్ ధియోధర్, స్టేట్ బిజెపి సెక్రటరీ పైడి వేణుగోపాలం, ఎంఎల్సి పివిఎన్.మాధవన్, బిజెపి ఫ్లోర్ లీడర్ టి.విష్ణుకుమార్ రాజు, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఐఎఎస్, నేషనల్ బీసీ మోర్చా ఎగ్జిక్యూట్ మెంబర్ దుప్పల రవీంద్ర బాబు, బిజెపి సిటీ ప్రెసిడెంట్ చల్లా వెంకటేశ్వరరావు, తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.