శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సభాపతి కోడెల

తిరుమలడిసెంబర్‌1(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారిని ఏపీ శాసన సభాపతి కోడెల శివప్రసాద్‌రావు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయనకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు జస్టిస్‌ నాగార్జున రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.