శ్రీవారిని దర్శించుకున్న లోకేశ్‌ దంపతులు

తిరుమల,జనవరి14(జ‌నంసాక్షి): మంత్రి నారా లోకేష్‌ దంపతులు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నారావారిపల్లెల్‌ఓల సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన వీరు ముందు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు లోకేష్‌ దంపతులకు ఆశీస్సులు అందించారు. ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్ధప్రసాదాలను అందజేశారు.