శ్రీవారి సేవలో ముఖేశ్ అంబాని
తిరుమల,నవంబర్27(జనంసాక్షి): తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున శ్రీవారికి నిర్వహించిన అర్చన సేవలో కుమారుడు అనంత్ అంబానీతో కలసి పాల్గొన్నారు. కుమార్తె ఇషా వివాహ ఆహ్వాన పత్రికను శ్రీవారి పాదాల చెంత
ఉంచి ఆశీస్సులు పొందారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.