శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు

కర్నూలు,నవంబర్‌23(జ‌నంసాక్షి): కార్తీక పౌర్ణమితో శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అభిషేకాలు, లక్ష ఒత్తుల వెలిగింపు వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఉదయాన్నే భక్తులు పాతాళగంగ చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో అభిషేకాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో కార్తీక మాసోత్సవాలకు తోడు పౌర్ణమి కావడంతో అభిషేకాలు నిర్వహించారు. కార్తీకమాసంలో భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆధ్యాత్మికంగా ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.