శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కేశోరామ్ సూర సమ్మయ్య

కమాన్ పూర్, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేమునూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో శనివారం కేశోరామ్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు సూర సమ్మయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు వారికి శాలువాతో సత్కరించి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుకల సతీష్, సూర సంతోష్, కన్నాల గ్రామ శాఖ అధ్యక్షులు బూతగడ్డల రమేష్, వేమునూర్ గ్రామ శాఖ అధ్యక్షులు లక్ష్మణ్,రాజ్ కుమార్, కలవెన స్వామి తదితరులు పాల్గొన్నారు.