షిండే, కమల్నాథ్ భేటీకి వెళ్లొద్దని ఎంపీల నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు సుశీల్కుమార్ షిండే, కమల్నాథ్ల సమావేశానికి వెళొద్దని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించారు. పెద్దపల్లి ఎంపీ వివేక్ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. తెలంగాణ విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని ఎంపీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు మాత్రం ఎఫ్డీఐలకు అనుకూలంగా ఓటేసేందుకు ఎంపీలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.