సంక్రాంతి లోగా సరుకుల పంపిణీ

విజయవాడ,జనవరి7(జ‌నంసాక్షి): సంక్రాంతి పండుగలోపే చంద్రన్న కానుకల పంపిణీని పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని పౌరసరఫరాల సంస్థ అధికారులు తెలిపారు. అన్ని జిల్లాలకు ఇప్పటికే వీటిని చేరవేశామని అన్నారు. సకాలంలో వీటిని పంపిణీ చేయాలని చౌక దుకాణాల డీలర్లకు సూచించామని అన్నారు. పచ్చిశనగపప్పు, నెయ్యి, బెల్లం నాణ్యతను పరిశీలించిన ఆయన కార్డుదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆనలైన్‌లో తలెత్తిన సమస్యలను పరిష్కరించామన్నారు.