సచివాలయాలు సందర్శించండి అంటూ ప్రజాప్రతినిధులతో సమావేశం అయిన ఎమ్మెల్యే గణేష్..

నర్సీపట్నం ఫిబ్రవరి 15 (జనంసాక్షి) :

నర్సీపట్నం నియోజకవర్గంలో గల అన గ్రామ సచివాలయాలను సందర్శించి ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా తోడ్పాటు అందించాలని నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. మంగళవారం
తన క్యాంపు కార్యాలయంలో నర్సీపట్నం టౌన్ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్లు, నియోజకవర్గం లో గల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీ,టౌన్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ జడ్పిటిసి వైస్ ఎంపీపీ లు తమ తమ పరిధి మండలాలలో గల గ్రామ స్థాయిలో గల సచివాలయాలు సందర్శించి సచివాలయ పనితీరును పరిశీలించి కుల , మత రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించే విధంగా సహాయం అందించే విధంగా సూచనలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చిటికెల భాస్కర్ నాయుడు ,పార్టీ సీనియర్ నాయకులు అంకంరెడ్డి జిమ్మీలు మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గుడబండీ ఆదిలక్ష్మి, గోలుగొండ ఎంపిపి మణికుమారి, నర్సీపట్నం ఎంపీపీ రాజేశ్వరి, మాకవరపాలెం ఎంపీపీ రుత్తల సత్యనారాయణ,రుత్తల వాసు, కోనేటి రామకృష్ణ, శెట్టి నూకరాజు ,సుర్ల సత్యనారాయణ, గొలుసు నరసింహమూర్తి, తమరాన నాయుడు, తదితరులు పాల్గొన్నారు.