సత్ప్రవర్తన కలిగిన 300 మంది ఖైదీలు విడుదల

2

– హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి

హైదరాబాద్‌,జనవరి 7(జనంసాక్షి): ఈ గణతంత్ర దినోత్సవానికి సత్పవ్రర్తన కలిగిన 300 మంది ఖైదీలను జనవరి 26న విడుదల చేయాలని భావిస్తున్నట్లు రాష్ట్ర ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు జాబితా సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు.  చంచల్‌గూడ జైలులో వార్షిక సదస్సుకు ¬ంమంత్రి హాజరైయ్యారు. ఏడాదిలో జైళ్ల శాఖ సాధించిన ప్రగతిని ఆయన సవిూక్షించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. జైళ్ల శాఖలో సంస్కరణలకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జనవరి 26న సత్పవ్రర్తన గల ఖైదీల విడుదలకు సిద్ధంగా ఉన్నాం. సుమారు 300 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.