సభ సజావుగా జరిగేలా విపక్షాలు సహకరించాలి: ప్రధాని

ఢిల్లీ: నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు వాయిదా పడకుండా చూడాల్సిన బాధ్యత విపక్షాలపైనే ఉందని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని ఆయన కోరారు. విపక్షాలు లెవనెత్తే ఏ అంశానైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలియజేశారు.