సమావేశాలు సజావుగా జరగాలి

4
– ప్రధాని మోదీ ఆకాంక్ష

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 23(జనంసాక్షి):పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు  ఫలవంతమవుతాయని తాను ఆశిస్తున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు. ఈ సమావేశాల్లో అన్ని సమస్యలపై విస్తృతంగా చర్చించనున్నామని చెప్పారు. సమావేశాల్నిఫలప్రదం చేసేందుకు ప్రతిపక్షాలు కూడా సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఇప్పటివరకు సమావేశాల్లో ఈ అంశాలపై చర్చించామని అన్నారు.  కోట్లాది మంది దేశ ప్రజలు బడ్జెట్‌ సమావేశాలపై దృష్టి పెట్టినట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్బంగా పార్లమెంట్‌ ఆవరణలో విూడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్న రీతిపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. ప్రతిపక్షాలతో సభా వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చించామని, అన్ని పార్టీలు సభకు సహకరిస్తాయన్న ఆశాభావాన్ని మోదీ వ్యక్తం చేశారు. సభా సమయం సద్వినియోగం అవుతుందన్న విశ్వాసాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల సమస్యలను చర్చిస్తామని, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను కూడా చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు మోదీ అన్నారు.