సహకార సంఘం ఛైర్మన్‌ను తీసుకువెళ్లిన కాంగ్రెస్‌ నేతలే

కరీంనగర్‌: బీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వం జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఓటు వేయడానికి వచ్చిన కాల్వశ్రీరాంపూర్‌ సహకారసంఘం ఛైర్మన్‌ శ్యాంసుందర్‌ను కాంగ్రెస్‌ పార్టీ నేతలు తమ వెంట తీసుకువెళ్లారు. దీనిపై ఇతర పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.