సానియా జోడీ ప్రపంచ రికార్డు
సిడ్నీ,జనవరి13(జనంసాక్షి):టెన్నిస్ మహిళల డబుల్స్ లో సంచలనాలు సృష్టిస్తోన్న భారత టెన్నిస్ స్టార్ సానియా విూర్జా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ తాజాగా మరో
రికార్డు నమోదు చేసింది. గతేడాది ఓవరాల్గా 10 డబ్ల్యూటీఏ టైటిల్స్ నెగ్గిన సానియా-హింగిస్ లు మహిళల డబుల్స్లో వరుసగా 28 మ్యాచ్లు గెలిచి అత్యధిక విజయాలు
సాధించిన జోడిగా నిలిచారు. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ మ్యాచ్లో చైనాకు చెందిన చెన్ లియాంగ్, సువాయ్ పెంగ్ జోడిపై 6-2, 6-3 తేడాతో డబుల్స్ నంబర్ వన్
ద్వయం గెలిచింది.సుమారు గంటపాటు జరిగిన మ్యాచ్లో చైనా జోడీపై విజయంతో ఈ ఇండో-స్విస్ ద్వయం సిడ్నీ ఓపెన్లో సెవిూఫైనల్స్లోకి దూసుకెళ్లింది. రెండు సార్లు
ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేయడంతో పాటు ఒకసారి తమ సర్వీస్ నిలబెట్టుకున్నారు. ఈ విజయంతో 1994లో డబుల్స్ ద్వయం గిగి ఫెర్నాండేజ్, నటాషా జ్వెరేవా నెలకొల్పిన వరుస విజయాల రికార్డును సానియా-హింగిస్ సమం చేశారు. టెన్నిస్ లో ప్రపంచ నంబర్ వన్ జంట సానియా విూర్జా-మార్టినా హింగిస్ జోడీ జోరు కొనసాగుతోంది. తెలంగాణ బ్రాండ్ అంబాసీడర్ సానియా విూర్జా 2016లోనూ అదరగొడుతోంది. మార్టినా హింగిస్ తో కలిసి వరసగా 28 మ్యాచ్ ల్లో నెగ్గి అత్యధిక విజయాలు సాధించిన జంటగా వరల్డ్ రికార్డ్ సమం చేసింది. సిడ్నీ ఇంటర్నేషనల్ ఓపెన్ లో సెవిూస్ కు చేరిన సానియా జోడీ.. 1994లో బిగి ఫెర్నాండెజ్, నటాషా నెలకొల్పిన స్ట్రయిట్ 28 మ్యాచ్ ల విన్నింగ్ రికార్డును సమం చేసింది. ఇక క్వార్టర్స్ మ్యాచ్ లో సానియా జోడి.. చెన్-ఫెంగ్ జంటపై 6-2, 6-3 తేడాతో సునాయాసంగా నెగ్గి మరో టైటిల్ దిశగా దూసుకుపోతోంది.