సింధూ న‌జ‌రానాపై కేటీఆర్ క్లారిటీ

ఒలింపిక్స్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించిన పీవీ సింధూకు తెలంగాణ ప్ర‌భుత్వం ఎలాంటి క్యాష్ రివార్డును ప్ర‌క‌టించ‌లేద‌ని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. అయితే ఈ రోజు సాయంత్రం జ‌రిగే క్యాబినెట్ భేటీ త‌ర్వాత సీఎం కేసీఆర్ రివార్డుపై ఓ ప్ర‌క‌ట‌న చేస్తార‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. సింధూను గోపీచంద్‌ల‌ను హైద‌రాబాద్‌లో ఘ‌నంగా సన్మానిస్తామ‌ని ఇదివ‌ర‌కే కేటీఆర్ చెప్పారు.