సింహగిరిపై మాఘ పౌర్ణమి పూజలు

ఆర్జిత సేవల కు విశేష స్పందన

విశాఖపట్నం.. పిబ్రవరి..17 (జనం సాక్షి బ్యూరో ): సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలోబుదవారం మాఘ పౌర్ణమి సందర్భంగా పలు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.. తెల్లవారుజామునే సింహాద్రి నాథుడు ,శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సుప్రభాతసేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు. అనంతరం గంగధార నుంచి తీసుకు వచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం జరిపించారు.. మాఘ పౌర్ణమి నేపథ్యంలో ఆలయములో నిర్వహించిన ఆర్జిత సేవలకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది .. నిత్య కల్యాణంతోపాటు లక్ష్మీనారాయణవ్రతాలు,పూజా కార్యక్రమం నిర్వహించారు..
ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ఆలయ బేడా మండపం చుట్టూ తిరువీధి నిర్వహించారు.. సింహాచలము దేవస్ధానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ఈ పూజల్లోపాల్గొని స్వామి అమ్మవారిని సేవించి తరించారు….