సిఎం చంద్రబాబుతో లెఫ్ట్‌ నేతల భేటీ

రైతు సమస్యలపై వినతిపత్రం అందచేత

అనంతపురం,నవంబర్‌24(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును పలువురు వామపక్ష పార్టీల నేతలు శనివారం కలిశారు. రెండురోజుల పర్యటనకు జిల్లాకు విచ్చేసిన సీఎం చంద్రబాబు స్థానిక ఆర్‌ అండ్‌ బీ అతిధిగృహంలో విడిది చేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నేతలు జగదీశ్‌, రాంభూపాల్‌ తదితరులు చంద్రబాబును కలిసి ఓ వినతిపత్రాన్ని అందించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం మంజూరుచేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు, సాగునీటి ప్రాజెకట్‌ఉలకు సంబంధించిన సమస్యలను ఇందులో ప్రస్తావించినట్లు సమాచారం.