సిఎం బావమరిదనంటూ వ్యక్తి హల్చల్
భోపాల్,ఆగస్ట్24(జనంసాక్షి): మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఒక వ్యక్తి తాను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బావమరిదని పేర్కొంటూ హంగామా సృష్టించాడు. మంత్రులకు, అధికారులకు మాత్రమే అనుమతించిన స్థానంలో కారును నడుపడుతుండటంతో జరిమానా విధించేందుకు ట్రాఫిక్ పోలీసులు నిర్దారించారు. దీంతో ఆవ్యక్తి తాను ముఖ్యమంత్రి బావమరిదనని, నాకు జరిమానా ఎందుకు విధిస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. ఈ అంశంపై స్పందించిన శివరాజ్సింగ్ చౌహాన్ తనకు రాష్ట్రంలో చాలామంది సోదరీమణులు ఉన్నారని, దీంతో వారి భర్తలందరూ తనకు బావమరుదులేనని అంటూ చట్టం తన కర్తవ్యం నిర్వహిస్తోందని అన్నారు.