సిగ్నలింగ్ వ్వవస్థలో సాంకేతికలోపం నిలిచిన రైళ్లు
పెదప్దల్లి : కరీంనగర్ జిల్లా పెద్దపల్లి రైల్వేస్టేషన్ సిగ్నలింగ్ వ్వవస్ధలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఈకారణంగా కాజీపేట బాలార్ష మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. పెద్దపల్లిలో జైపూర్ ఎక్స్ప్రెస్, కొలనూర్లో జీటీ ఎక్స్ప్రెస్, రాఘవాపూర్లో భాగ్యనగర్, రామగుండంలో చైన్నై ఎక్స్ప్రెస్లను అధికారులు నిలిపి వేశారు, సిగ్నలింగ్ వ్వవస్థను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు.