సిబిఐని భ్రష్టు పట్టించారు: తెలుగుయువత

కాకినాడ,నవంబర్‌19(జ‌నంసాక్షి): బిజెపి నమ్మించి మోసం చేసిందని జిల్లా తెలుగు యువత కార్య నిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకట రమణ పేర్కొన్నారు. సోమవారం రాజోలు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బోళ్ళ మాట్లాడుతూ.. సిబిఐని అవినీతిమయం చేసి భ్రష్టుపట్టించారని, సిబిఐ, ఈడీ, ఐటీలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల తీవ్ర సమస్యలు వచ్చాయని, రూపాయి విలువ పడిపోయిందని పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని, రాజ్యాంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. దేశాన్ని కాపాడుకోవాలనే జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను టిడిపి ఏకం చేస్తుందన్నారు. ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇస్తామని, విభజన హావిూలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ చెబుతోందని, ప్రజలంతా మెచ్చేలా అమరావతిని నిర్మించే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని బోళ్ళ తెలిపారు. ఈ సమావేశంలో బెతినీడి శ్రీను, కొణతం దొరబాబు, ఆరుమిల్లి భాను, పలువురు

పాల్గొన్నారు.