సీఎంఆర్ఎఫ్ పేద‌ల ఆరోగ్యానికి అండ‌.

పేద‌ల ఆరోగ్యానికి స‌ర్కారు భ‌రోసా.
మాజీ మంత్రి ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి.
తాండూరు జులై 20(జనంసాక్షి)పేద‌ల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌తో తెలంగాణ స‌ర్కారు భ‌రోసా అందిస్తుంద‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూర్ లోని ఎమ్మెల్సీ నివాసంలో తాండూర్ మండలం ఐనెల్లి గ్రామానికి చెందిన వరుణ్ కుమార్ రెడ్డికి, 50,500 /- రూపాయల చెక్కును ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ల‌బ్దిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల‌ను అంద‌జేశారు.ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ పేద‌ల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌తో తెలంగాణ స‌ర్కారు భ‌రోసా అందిస్తుంద‌ని అన్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ వైద్యం చేయించుకోలేని నిరుపేద‌లు సీఎంఆర్ఎఫ్ ప‌థకాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఛైర్మెన్ రవి గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, హరిశ్వర్ రెడ్డి ,రామలింగ రెడ్డి,జర్నప్ప,పవన్ కుమార్ రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.