సీఎంకు సభా హక్కుల నోటీసులివ్వండి..

– లోక్‌సభ స్పీకర్‌కు టీఎంపీల ఫిర్యాదు – ఉద్యమంలో జేఏసీతో కలిసి పని చేస్తాం..

– అవసరమైతే రాజీనామాలకైనా సిద్ధం : టీఎంపీలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) :

గత నెల 30న జరిగిన తెలంగాణ మార్చ్‌ను అడ్డుకునేందుకు సీఎం కిరణ్‌ వ్యవహరించిన తీరుపై టీఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. సీఎంకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులివ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జేఏసీతో కలిసి పని చేస్తామని, అవసరమైతే రాజీనామాకైనా సిద్ధమని అనంతరం మీడియాతో టీఎంపీలు వెల్లడించారు. శనివారం ఎంపీ మధుయాష్కీ నివాసంలో తెలంగాణ జేఏసీ నేతలతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో పొన్నం  ప్రభాకర్‌, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, జి.వివేక్‌, మందా జగన్నాథం, రాజయ్య తదితరుల పాల్గొన్నారు. అనంతరం జేఏసీ నేతలతో కలిసి వారు     మిగతా 3లో