సీఎం కెసిఆర్   జన్మదిన వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమాలు.

రాజన్నసిరిసిల్లబ్యూరో.. ఫిబ్రవరి 17. (జనంసాక్షి)
భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని  బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం ఉదయాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గాంధీ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. జిల్లా ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్డు పంపిణీ చేయడంతో పాటు బైపాస్ రోడ్ లోని కొండ లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ నుండి రగుడు చౌరస్తా వరకు మొక్కలు నాటారు. కార్యక్రమంలో తెలంగాణ పవర్ లూమ్ టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, బొల్లి రామ్మోహన్, ఎండి సత్తార్, పలువురు నాయకులు పాల్గొన్నారు.