*సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి.

చిట్యాల సెప్టెంబర్11( జనం సాక్షి) అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మండల వీఆర్ఏల మండల అధ్యక్షులు బందెల ప్రేమ్ కుమార్ అన్నారు. వీఆర్ఏ మండల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిరవధిక సమ్మె 49వ రోజు నిరసనలో భాగంగా గత శనివారం మిర్యాలగూడ మండలానికి చెందిన కంచర్ల వెంకటేశ్వర్లు పే స్కేల్ రాదన్న మనస్థాపంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ సందర్భంగా మండల జేఏసీ చైర్మన్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ వీఆర్ఏలు అందరూ పిట్టల్లా రాలిపోతున్న ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి సరి అయింది కాదని వెంటనే ముఖ్యమంత్రి  ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, చనిపోయిన వీఆర్ఏలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని మండల విఆర్ఏ జేఏసీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే వారి ఆత్మకు శాంతి చేకూరాలని మండల వీఆర్ఏ జేఏసీ నివాళులు అర్పించారు.  ఈకార్యక్రమంలో మండల వీఆర్ఏ జేఏసీ కో చైర్మన్ మేదరి సతీష్, కన్వీనర్ లక్ష్మీకాంత్, సాంబయ్య,, శివ ,సమ్మయ్య భద్రయ్య, సదయ్య, రాజు, సురేష్, రాజలక్ష్మి, రాజమల్లు, రాము ,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area