సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

విశాఖపట్టణం,జనవరి24(జ‌నంసాక్షి):తెదేపా ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం పట్ల ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నక్కపల్లి ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ కొపిశెట్టి వెంకటేశ్‌ ఆధ్వర్యంలో బస్టాండ్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాం వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆది నుంచి కాపులకు న్యాయం చేస్తుంది తెదేపా మాత్రమేనని సీఎం ప్రత్యేకంగా వారి కోసం కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని వెల్లడించారు. వివిధ పదవుల్లో వారికే ప్రాధాన్యత కల్పించారని తాజాగా రిజర్వేషన్లు 5 శాతం కేటాయించడం కాపుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియ జేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ఎంపీటీసీ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.