సీనియర్‌ జర్నలిస్ట్‌ పాంచజన్య మృతి

సంతాపం తెలిపిన జర్నలిస్ట్‌ మిత్రులు

విజయవాడ,నవంబర్‌28(జనంసాక్షి): సీనియర్‌ జర్నలిస్ట్‌, ఆంధ్రపత్రిక, మహానగర్‌ దినపత్రికల సంపాదకుడు పాంచజన్య బుధవారం కన్ను మూశారు. గతకొంత కాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న పాంచజన్య చికిత్స పొందుతూ మృతి చెందారు. దశాబ్దాలుగా జర్నలిజానికి అంకితమైన పాంచజన్య జర్నలిజం విలువల కోసం నిరంతరంగా పనిచేశారు. పత్రికా విలువలు కాపాడడంలో ఎక్కడా రాజీ పడలేదు. ఆయన మృతిపట్ల జర్నలిస్ట్‌ మిత్రులు తీవ్ర సంతాపం ప్రకటించారు. హైదరాబాద్‌ ప్రెస్‌ కల్బ్‌ తీవ్ర సంతాపం ప్రకటించిది. ఆయన విూతి తీరని లోటని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, వైకాపా అధ్యక్షుడు జగన్‌, బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ఆయన మృతి పత్రికారంగానికి తీరని లోటన్నారు. పాంచజన్య మృతి వ్యక్తగతంగా తనకు తీరని లోటని ఆర్‌ఎన్‌ఎ ఎడిటర్‌ అవ్వారు రఘు నివాళి అర్పించారు. పత్రికా రంగలో ఆయన సమున్నత విలువల కోసం పోరాడారు. ఏనాడూ తన వృత్తి ధర్మంలో వెనకడుగు వేయలేదన్నారు.