సీనియర్ జర్నలిస్టు మనుమని జన్మదిన వేడుకలకు హాజరైన ఐజేయు అద్యక్షుడు..

హన్మకొండ బ్యూరో నవంబర్ 5 జనంసాక్షి జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు, టీయూడబ్ల్యూజేే నాయకులు ఎం. సుధాకర్ రావు మనుమని జన్మదిన వేడుకలు శనివారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఐజేయు జాతీయ అద్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజేే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ తదితర నాయకులు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు ఎం. సుధాకర్ రావు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేే రాష్ట్ర కార్యదర్శి గాడిపెల్లి మదు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుంటి విద్యాసాగర్,హనుమకొండ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, వరంగల్ జిల్లా అద్యక్షుడు రామ్ చంద్రయ్య, జాతీయ కౌన్సిల్ సభ్యులు నల్లాల బుచ్చిరెడ్డి, కె. రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.