సుగుణమ్మకు నివాళులర్పించిన ప్రముఖ నేతలు

మునగాల, అక్టోబర్ 2(జనంసాక్షి): మునగాల మండల ప్రముఖ సామాజిక కార్యకర్త వేమూరి సత్యనారాయణ తల్లి సుగుణమ్మ గత శనివారం మృతి చెందిన విషయం విదితమే. అయితే కోదాడ నియోజకవర్గంలోని ప్రముఖ ఆయా పార్టీల నేతలు వేమూరి సత్యనారాయణ గృహానికి వెళ్లి ఆయనను పరామర్శించి, సత్యనారాయణ తల్లి సుగుణమ్మ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి, జలగం సుదీర్, బొలిశెట్టి నాగేంద్రబాబు, చెర్వుపల్లి శ్రీనివాస్, సీఐ కిరణ్, వీరయ్య, పోలంపల్లి వెంకటేశ్వర్లు, వెంకట్రామయ్య, బారి లక్ష్మయ్య, బొమ్మ చిన్నవెంకన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.