సునీతా లక్ష్మారెడ్డి ఇంటిముందు ఆందోళనకు దిగిన అంధులు

హైదరాబాద్‌, జనంసాక్షి: మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి ముందు అంధులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. పెట్రోల్‌ బాటిళ్లతో ఆందోళనకు దిగిన అంధులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.